Thursday, April 25, 2024

దీపిక పదుకొనే ఫ్యామిలీ మొత్తానికి కరోనా !!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ఈ మహమ్మారి బారిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. అలాగే ఇప్పటికే చాలా మంది సినీస్టార్స్ ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఆమె తండ్రి ప్రకాష్, ఆమె తల్లి ఉజాల, చెల్లెలు అనీషాలకు కరోనా సోకింది. ఇక ప్రకాష్ ప్రస్తుతం బెంగళూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదిరోజుల కిందట ఇంట్లో అందరికీ స్వల్ప లక్షణాలు కనిపించాయని… దీంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందని.. బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ చెప్పారు. వారం రోజులుగా ఇంట్లోనే ఉన్న ప్రకాష్ కు జ్వరం తగ్గికపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement