Monday, April 29, 2024

హాస్ప‌ట‌ల్ లో.. క‌మెడియ‌న్ రోహిణి

బుల్లితెర‌తో పాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది న‌టి రోహిణి. ప్ర‌స్తుతం ఆమె హాస్ప‌ట‌ల్ బెడ్ పై ఉంది. ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటుంది. తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రోహిణీయే స్వయంగా వెల్లడించింది. దాదాపు ఐదేండ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్‌లో రోహిణి కాలిలో ఓ రాడ్‌ వేశారు. దాన్ని ఎప్పట్నుంచో తీసేయించాలని రోహిణి అనుకున్నప్పటికీ.. అప్పుడే కెరీర్‌లో బిజీగా మారడంతో కుదర్లేదు. ఇన్నేళ్లకు కాస్త టైమ్‌ దొరకడంతో ఆస్పత్రికి వెళ్లి రాడ్‌ తీసేయించుకోవాలని భావించింది. అందుకే రీసెంట్‌గా ఆస్పత్రికి వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రోహిణి కాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు షాకిచ్చారు.

చాలా కాలం కావడంతో రాడ్‌ స్కిన్‌కు అతుక్కుపోయిందని.. ఒకవేళ ఫోర్స్‌ పెట్టి తీస్తే మల్టీపుల్‌ ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో కాలిలో నుంచి రాడ్‌ తీయడం సాధ్యపడలేదు. కానీ ఆమె కాలికి మైనర్ సర్జరీ మాత్రం చేశారు. ఇదే విషయాన్ని రోహిణి వెల్లడించింది.కాలిలో వేసిన రాడ్‌ను తీసేయించుకునేందుకు ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లడం నుంచి ఆపరేషన్‌ జరిగిన తర్వాత బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉండటం వరకు ప్రతీది రికార్డ్‌ చేసుకుంది. దాన్నే తన యూట్యూబ్‌ వీడియోలో పోస్టు చేసింది. రాడ్‌ తీసేసుకోవడానికి ఇంటి నుంచి వెళ్తున్నానని రోహిణి ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఆస్పత్రికి వెళ్లింది. కానీ హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత రాడ్‌ తీయడం కుదరకపోవడంతో ఆమె చాలా డిసప్పాయింట్‌ అయ్యింది. ఐదేండ్ల నుంచి రాడ్‌తో అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడొచ్చని ఆశపడితే ఇలా జరిగిందని వాపోయింది. హాస్ప‌ట‌ల్ బెడ్ పై ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement