Tuesday, April 30, 2024

పుష్ప పై ఆ క్లారిటీ వచ్చేసింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల కాలంలో పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు రాగా… ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

చిత్ర నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఈ విషయాన్ని చెప్పారు. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్టుకు రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమని భావించి… అందరం కలిసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీయాలని నిర్ణయించామన్నారు. ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ 10 శాతం పూర్తయిందన్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement