Thursday, April 25, 2024

కరోనా పై అవగాహన కోసం….సినీ స్టార్స్ !! టాలీవుడ్ నుంచి మెగాస్టార్

దేశంలో కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ను ఎదుర్కొన్నాము. ఇప్పుడు సెకండ్ వేవ్ ను కూడా ఎదుర్కొంటున్నాం. అయితే దీంతో అయిపోలేదు. అందరు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కరోనా పై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది. ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ హిందీ ,మరాఠీ, పంజాబీ, తెలుగు తమిళం కన్నడ భాషలలో ప్రచారం చేయనుంది.

అందుకుగాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పంజాబీ, మరాఠీ,హిందీలో అక్షయ్ కుమార్ ,తమిళ్ లో ఆర్య, కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరోలతో క్యాంపైన్ చేయనున్నారు. జూన్ 5 నుంచి టీవీ పేపర్ ఇంటర్నెట్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ పైన యాడ్స్ ప్రచారం కానున్నాయి. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి మహమ్మారిని ఓడిద్దాం అంటూ సందేశం ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement