Wednesday, May 1, 2024

వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’

వెండితెరపై వినోదం పండించే వెన్నెల కిషోర్ హీరో అవుతున్నాడు. వెన్నెల కిశోర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’.అదితి సోనీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టీ-జీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

సినిమాను ప్రకటించడంతో పాటు- కాన్సెప్ట్‌ టీ-జర్‌ కూడా విడుదల చేశారు.చిత్ర దర్శకుడు టీ-జీ కీర్తి కుమార్‌ మాట్లాడుతూ ”ఇదొక యాక్షన్‌ కామెడీ సినిమా. ఇందులో వెన్నెల కిశోర్‌ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీ-లో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్‌ ్టసలిష్‌గా ఉంటు-ంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్‌ ఉంటు-ంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్కీన్ర్‌ మీద చూడాలి. అని చెప్పారు

.చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ స్పై జానర్‌ సినిమాల్లో చారి 111 కొత్తగా ఉంటు-ంది. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. విలన్‌ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది అని చెప్పారు

- Advertisement -

.ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, సంయుక్తా విశ్వనాథన్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్‌ రవీంద్రన్‌, పావని రెడ్డి, తాగుబోతు రమేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్‌ గ్రోవర్‌, సంగీతం : సైమన్‌ కె కింగ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement