Friday, April 26, 2024

ఆగస్టు వరకు వెయిట్ చేయలేను…తమన్ ట్వీట్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ తో పాటు కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి…ఆగస్టు వరకు వెయిట్ చేయలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమన్ ట్వీట్ తో మహేష్ అభిమానులు అంతా ఒక్కసారిగా ఆ అప్డేట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు. మరి తమన్ ఎలాంటి అప్డేట్ ను ఇస్తారో చూడాలి. ఇక వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ , పవన్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు తమన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement