Thursday, May 2, 2024

బ్రేక‌ప్ అయింది.. అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంది.. సాయి ధ‌ర‌మ్ తేజ్

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం విరూపాక్ష‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది.కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించ‌టం విశేషం. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ కూడా పార్ట్ అయ్యింది. విరూపాక్ష సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

అది కూడా త‌న ప్రేమ‌, పెళ్లి గురించి కావ‌టంతో ఆ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఎవ‌రో అడుగుతున్నారని తాను పెళ్లి చేసుకోనన్నారు. నాకు కరెక్ట్‌గా సెట్ అయితేనే చేసుకుంటాను. అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంది. బ్రేక‌ప్ అయ్యింది. బ్రేక‌ప్ త‌ర్వాత బాగా సైలెంట్ అయిపోయాను . అదే స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ నాకు తార‌క్ 9-10 ఏళ్లుగా తెలుసు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేట‌ప్పుడు త‌న‌తో ప‌రిచ‌యం అయ్యింది. చాలా మంచి స్నేహితుడు. మా ఇంట్లోవాళ్లు కాకుండా బ‌య‌టి నుంచి నాకు సపోర్ట్ చేసింది తార‌క్‌. అరే తేజుగా నువ్వు హ్యాపీగా సినిమ‌లు చేయాలిరా అని తార‌క్‌, క‌ళ్యాణ్ రామన్న స‌పోర్ట్ చేస్తుంటారు. విరూపాక్ష సినిమా గ్లింప్స్‌కు త‌న వాయిస్ ఓవ‌ర్‌తో అద‌ర‌గొట్టారు. సాధార‌ణంగా నేను క‌థ‌లు విన్న‌ప్పుడు మ‌న‌సు చెప్పేస్తుంటుంది. . ఇంత‌కు ముందు కంటిన్యూగా చేసేసేవాడిని. అప్పుడు మ‌ధ్య‌లో కాస్త దెబ్బ తిన్నాను. దాంతో జాగ్ర‌త్త‌ప‌డుతున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement