Friday, May 17, 2024

రామ్‌చరణ్‌తో మరోసారి జతకట్టనున్న కియారా

‘వినయ విధేయ రామ’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి నటించిన కియారా అద్వానీ మరోసారి అతడితో జతకట్టనుంది. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించనున్న సినిమాలో కియారా నటించనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ మూవీలో కొరియన్ హీరోయిన్ సుజీబే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్ర బృందం బాలీవుడ్ భామ కియారా అద్వానీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆమెను ఫైనల్ చేశారని టాక్. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతుండగా.. జూలై నుంచి షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement