Sunday, April 28, 2024

కరోనా బాధితుల కోసం బాలయ్య మరో ముందడుగు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి సమయంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి కొంతమంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు.

కాగా తాజాగా నందమూరి బాలకృష్ణ కరోనా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఆయన తన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కోసం కేటాయించినట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో పలువురు ప్రముఖులు నటీనటులు ఎలా ముందుకు వచ్చి సాయం చేయడం ఎంతో గొప్ప విషయమని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాట కూడా చాలా మంది స్టార్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement