Friday, April 26, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఆర్ మురుగదాస్ విరాళం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. అయితే ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ స్టార్స్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక కోలీవుడ్ లో మొన్న సూర్య సోదరులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి తమ వంతుగా కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

ఇప్పుడు తాజాగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన వంతు సహాయ సహకారాలను అందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన ఆయన 25 లక్షల రూపాయలను విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఇలాంటి ఆపద సమయంలో సినీస్టార్స్ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం పట్ల నెటిజన్లు వారి పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement