Friday, March 29, 2024

పి వి సింధూ బ్యాడ్మింట‌న్ అకాడ‌మి – విశాఖ‌లో రెండు ఎక‌రాలు కేటాయింపు

అమ‌రావ‌తి – ఒలింపియ‌న్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పి వి సింధూ ఎపిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మి ఏర్పాటునకు తొలి అడుగు ప‌డింది.. విశాఖ‌లో ఈ అకాడ‌మి ఏర్పాటు కోసం రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించింది..ఈ మేరకు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ట్విట్ చేశారు..రెండేళ్ల క్రితం జ‌గ‌న్ ఈ అకాడ‌మి కోసం స‌హ‌కారం ఇస్తాన‌ని సింధూకి ఇచ్చిన వాగ్ధానం మేర‌కు నేడు ఈ స్థ‌లాన్ని కేటాయించిన‌ట్లు మేక‌పాటి పేర్కొన్నారు.. ఈ అకాడ‌మి విశాఖ‌లో స్థాప‌న వ‌ల్ల ఉత్త‌రాంధ్ర యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement