Friday, April 26, 2024

కరోనా నుంచి కోలుకుంటున్నా: జూ.ఎన్టీఆర్

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నానని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవుతోందని… త్వరలోనే నెగెటివ్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ మేరకు తారక్ ట్వీట్ చేశారు.

కాగా, ఈ నెల 10న ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకినట్టు తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచనలను పాటిస్తూ.. ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, చిరంజీవి, నారా లోకేశ్, మహేశ్ బాబు వంటి ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. 

ఇదీ చదవండి: లాక్ డౌన్ పొడిగింపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement