Sunday, May 19, 2024

కరాటే కళ్యాణి కి ఎంపీ నంటూ ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి!!

సినీ తారలకు ఆకతాయిల వేధింపులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇలా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. తాజాగా కరాటే కళ్యాణి కి ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి వేధించాడు. ఇదే విషయమై చెబుతూ కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిస్సా లో తాను మూడు సార్లు ఎంపీగా గెలిచానని…మీ సేవా కార్యక్రమాలు బాగున్నాయని ఏదైనా సహాయం కావాలంటే చేస్తానని ఆ వ్యక్తి ఫోన్ చేశాడట. అలా గొంతు మార్చి తనతో పలుమార్లు మాట్లాడాడని కల్యాణి తెలిపారు.

పది సార్లు ఫోన్ చేసిన తర్వాత మీకు పెళ్లి అయ్యిందా అని అడిగాడు. దీంతో విషయం అర్థమై ఫోన్ కట్ చేశా. మీ ఫోన్ నెంబర్ కోసం విజయశాంతి డీకే అరుణ గారిని నేను అడిగానని ఆయన అన్నారు. అంత ఇంట్రెస్ట్ మరి…నా మీద ఎందుకో అంటూ ఫేస్ బుక్ లో ప్రశ్నించారు కరాటే కళ్యాణి. మీకు బిజెపిలో ఏదో పదవి ఉందనుకున్న అంటూ మొదట మాట తెలిపాడట. తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనని కూడా చెప్పాడట. కాగా సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త… అని కరాటే కళ్యాణి హెచ్చరించారు. ఎవ్వరిని నమ్మవద్దని తనతో పెట్టుకుంటే బాజా భారత్ అంటూ వార్నింగ్ ఇచ్చారు కళ్యాణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement