Sunday, May 5, 2024

‘వెంకీ కుడుముల’కి కుచ్చుటోపి

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుములకి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్ళు.  గత ఏడాది నితిన్‌తో ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించి సూపర్‌హిట్‌ కొట్టాడు. ఈ సక్సెస్‌ తర్వాత యంగ్‌ డైరెక్టర్స్‌ లిస్టులో వాంటెడ్‌గా మారిన వెంకీ కుడుములకు సైబర్‌ కేటుగాళ్లు టోపీ వేశారు. అది కూడా ఆయన డైరెక్ట్‌ చేసిన చిత్రం ‘భీష్మ’ పేరు చెప్పి. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ‘భీష్మ’ సినిమాను నామినేట్‌ చేస్తామంటూ చెప్పి రూ.66 వేలు డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు.  ఓ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానల్‌ సభ్యుడినంటూ రీసెంట్‌గా డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భీష్మ’ చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్‌ చేస్తామని నమ్మబలికాడు. ఒక్కొక్క కేటగిరీకి పదకొండు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి ఆరవై ఆరువేల రూపాయలను డిపాజిటి్‌ చేశాడు. అయితే మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్‌ చేసి ఆరు కేటగిరిలకు సంబంధించి మూడింట నామినేషన్స్‌లో తప్పు జరిగిందని, సరి చేయడానికి కాస్త మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన వెంకీ కుడుముల నామినేషన్‌ అవసరం లేదని చెప్పాడు. తర్వాత విషయాన్ని ఆరా తీయగా, తనకు వచ్చిన కాల్‌ ఫేక్‌ అని, జరిగిన మోసం తెలిసింది. దీంతో వెంకీ కుడుముల సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్‌ నెంబర్, అకౌంట్‌ డీటయిల్స్‌ ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement