Friday, May 3, 2024

‘నాంది’ థ్రిల్లింగ్ గా ఉంది..’గోపిచంద్ మలినేని’

హీరో అల్లరి నరేష్ నాంది చిత్రంతో ఎనిమిది ఏళ్ల తర్వాత విజయాన్ని సాధించాడు. ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి అల్లరి నరేష్ కి మంచి పేరుని కూడా తీసుకొచ్చింది.  ప‌లువురు ప్ర‌ముఖులు ఈ చిత్రంపై ప్ర‌శంసలు కురిపించ‌గా, తాజాగా క్రాక్ చిత్ర డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నాంది చిత్రం ఇప్పుడే చూశాను. చాలా థ్రిల్లింగ్ ఉంది. అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌ట‌న అద్భుతం. ప్రియ‌ద‌ర్శి, హ‌రీష్, ద‌ర్శ‌కుడు విజ‌య్ త‌న ప‌నిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించారు .. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు అంటూ గోపిచంద్ మ‌లినేని త‌న ట్వీట్‌లో తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement