Saturday, April 27, 2024

దాస‌రికి ప‌ద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి చిరు రిక్వెస్ట్..

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావుకి ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్ర‌భుత్వానికి ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.  దాస‌రి నారాయ‌ణ రావుగారి జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు త‌న‌ స్మృత్యంజ‌లి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. శ్రీ దాస‌రికి ఇప్ప‌టికీ త‌గిన ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన‌కు ఇప్ప‌టికైనా (మ‌ర‌ణానంత‌రం) విశిష్ట‌మైన ప‌ద్మ పురస్కారం ద‌క్కితే అది మొత్తం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ద‌క్కే గౌర‌వం అవుతుంద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. విజ‌యాలలో ఒక‌దానికి మించిన మ‌రో చిత్రాల‌ని త‌న అపూర్వ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మ‌ల‌చ‌డ‌మే కాదు.. నిరంత‌రం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ మార్గ‌ద‌ర్శ‌క‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement