Thursday, April 18, 2024

ఎపి గ్రామాల‌లో క‌రోనా క‌ఠిన అంక్ష‌లు – గ్రామ స‌భ‌ల‌లో తీర్మానం….

మాస్క్‌ లేకపోతే జరిమానా
కరోనా నిబంధనలు పాటించేలా యజమానులే చూసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ
అమరావతి, : రాష్ట్రంలో కరోనా రెండో దశ ప్రజలను వణికిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫలితంగా ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేపటి నుంచి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తూ మిగిలిన సమయంలో కర్ఫ్యూ విధించింది. ఇదే సయంలో గ్రామాల్లో కూడా కరోనా కట్టడికి ఆంక్షలు మొదలయ్యాయి. గ్రామాల్లోకి మాస్క్‌ లేకపోతే రానివ్వబోమంటూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలూ తీర్మానం చేశాయి. ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలుంటే..వాటిలో 99 శాతం గ్రామాల్ల గ్రామసభలు జరిగాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు స్వచ్ఛందంగా తగిన జాగ్రత్తలు పాటిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న గ్రామసభల్లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా మాస్క్‌ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి.. జరిమానా విధించాలని స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకున్నారు. గ్రామాల్లోని హోటళ్లు, టీ-స్టాళ్ల వద్దకు వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా యజమానులే చూడాలని.. లేకపోతే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆయా హోటళ్లు, టీ-స్టాళ్ల నుంచి జరిమానా వసూలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కరోనా నిబంధనలు పాటించకపోయినా జరిమానాల మోత మోగుతుంది. గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేసి ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రత్యేకంగా గ్రామ కమిటీ-లను ఏర్పాటు- చేశారు. ఈ కమిటీ-లకు అధ్యక్షులుగా సర్పంచ్‌లు వ్యవహరిస్తారు. వార్డు సభ్యులు, గ్రామ సచివాలయంలో పనిచేసే మహిళా పోలీస్‌తో పాటు- ఏఎన్‌ ఎంలు ఈ కమిటీ-ల్లో సభ్యులుగా ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement