Wednesday, May 1, 2024

‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా..

యంగ్ హీరో కార్తికేయ నటిస్తోన్న చిత్రం చావుకబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తోన్న చిత్రం ఇది‌. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 19న సినిమా విడుదలవుతుంది.  మార్చి 9న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ జె.ఆర్‌.సి కన్వెషన్‌ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకకి స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చాయి. హీరో కార్తికేయ ఇందులో శవాలను తీసుకెళ్లే వెహికల్‌ డ్రైవర్‌ పాత్రలో నటిస్తే.. లావణ్య త్రిపాఠి నర్సు పాత్రలో నటించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement