Friday, May 3, 2024

‘చావు కబురు చల్లగా’ నుండి మరోసాంగ్ రానుంది

యంగ్ హీరో  కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”చావు కబురు చల్లగా” మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెగళ్ళపాటి కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన హీరో కార్తికేయ టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మరో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ‘కదిలే కాలాన్నడిగా’ అనే గీతాన్ని ఫిబ్రవరి 23న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని చిత్ర బృందం వదిలింది. ఇందులో లావణ్య టీ తాగుతూ నవ్వుతూ ఉండగా.. పక్కనే ఉన్న గోడపై కూర్చున్న కార్తికేయ ఆమె వైపు చూస్తూ మురిసిపోతూ కనిపిస్తున్నాడు. ఇద్దరు కూడా డీ గ్లామరస్ గెటప్స్ లో ఇంతకముందెన్నడు చూడని లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ ‘బస్తీ బాలరాజ్’ గా.. లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement