Friday, May 3, 2024

రెండేళ్ల తరువాత పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌

ప్రభన్యూస్ : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తమ పాల ధరలను పెంచినట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల తరువాత ఈ పెంపునకు ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో పాటుగా ముడి సరుకుల ధరలు పెరగడం కారణం అని తెలిపింది. పెంచిన ఈ ధరలతో ఆవు పాలు ధర రూ.2లు పెరగ్గా, గేదె పాలు మూడు రూపాయలు, స్కివ్డు పాలు మూడు రూపాయల ధర పెరిగింది. పెంచిన ఈ థరలతో 500మిల్లీ లీటర్ల ఆవు పాలు ఇప్పుడు రూ.40లకు, గేదె పాలు రూ.48లకు లభిస్తే, స్కివ్డు పాలు రూ.30లకు లభిస్తాయి.

ఈసందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా ముడి పాల ధరలు 15శాతంకు పైగా పెరిగాయన్నారు. ఇంధన ధరలు 45 శాతం, ద్రవ్యోల్బణ ప్రభావంతో మేత, ప్రింటింగ్‌ ఇంక్‌ ధరలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. ఇవన్నీ కలిసి మొత్తంమ్మీద ఇన్‌ఫుట్‌ ధరలు పెంచాయన్నారు. దాంతో తప్పనిసరై పాల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement