Thursday, May 2, 2024

మీ షో మెగా బ్లాక్‌ బ్లస్టర్‌ సేల్‌.. 23 నుంచి అందుబాటులోకి

ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ మీషో సెప్టెంబర్‌ 23 నుంచి 27వ తేదీ వరకు మోగా బ్లాక్ బ్లస్టర్‌ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌ సందర్భంగా అతి తక్కవ ధరల్లోనే కోట్లాది ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురారున్న‌ట్టు తెలిపింది. 8 ప్రాంతీయ భాషల్లో మీషో వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకొనే తో పాటు ఏడుగురు సెలబ్రిటీలతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. మీషోలో ఏడు లక్షల మంది విక్రేతలు భాగస్వాములుగా ఉన్నారు. 6.5 కోట్ల ప్రొడక్ట్‌ లింక్‌లు ఉన్నాయి. 30 విభాగాల్లో అమ్మకాలు జరపనున్నట్లు తెలిపింది. పేటీఎం, ఫోన్‌పేతో ఒప్పందం చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తక్షణ చెల్లింపులపై రాయితీలు అందిం స్తున్నట్లు మీషో వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement