Saturday, May 18, 2024

ఎంసీఎల్‌ఆర్‌ను పెంచిన ఐసీఐసీఐ

ప్రైవేట్‌ రంగ దిగ్గజబ్యాంక్‌ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) ను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ రుణాలకు వర్తిస్తుంది. ఈ రేట్లు 1 సెప్టెంబర్‌ 2022 నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతం, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్‌, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్‌ తన రేట్లను 15 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement