Sunday, April 28, 2024

YSRTP: షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల.. కలిసి సాగేందుకు నేను రెడీ..

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు రంగారెడ్డి జిల్లాలో మంచి స్పందన వస్తోంది. పాదయాత్ర సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఆమెను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. తాజాగా ఈరోజు ఆమె పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్యామ‌ల మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం వైస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని అన్నారు. ఎనిమిది రోజులుగా అక్క నడుస్తున్నారని.. ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని.. ఆ విషయాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు.

ఒక సీఎం కూతురు, మరో సీఎం చెల్లెలు అయిన ష‌ర్మిల‌క్క‌ ఎంతో సంతోషంగా ఉండొచ్చని.. కానీ, వారి నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని శ్యామ‌ల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement