Friday, May 3, 2024

YSRCP – సత్తెనపల్లిలోజనమాల…సీఎం జగన్ యాత్రకు అపూర్వసాగతం

(ఆంధ్రప్రభ , పల్నాడు బ్యూరో ) – ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పల్నాడు జనం బ్రహ్మరథం పట్టారు. – జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది. ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో వైఎస్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. బస్సుయాత్రలో వస్తున్న జగన్‌కు భారీ గ‌జ‌మాల‌తో అపూర్వ స్వాగతం ప‌లికారు. సత్తెనపల్లి ప్రధానరహదారి జనంతో కిక్కిరిసింది. జ‌న‌నేత‌కు అడుగడుగునా మహిళలు నీరాజనం ప‌లికారు.-

సత్తెనపల్లికి దాదాపు రెండు కిలోమీటర్ల ముందే బారులు తీరిన జనం. సత్తెనపల్లి మెయిన్‌రోడ్‌కి ఇరువైపులా సీఎం కోసం బారులు తీసిన మహిళలు, అవ్వాతాతలు, అన్నదాతలు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టితీసి మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. దారిపొడువునా అన్న మళ్లీ నువ్వే వస్తావ్‌.. ప్లకార్డులు అంటూ అభిమానులు ప్రదర్శించారు. జగన్‌తో పాటు సత్తెనపల్లిలో కదిలిన జనప్రవాహం పరవళ్లు తొక్కింది. మళ్లీ సీఎం కావాలి, జగన్ పాలనలో సంతోషంగా ఉన్నాం, సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది అంటూ జనం నీరాజనం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement