Monday, April 29, 2024

డప్పుకొట్టి దరువేసిన ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా డప్పు కొట్టి హల్ చల్ చేశారు. మంగళవారం పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుమారు ఏడు వందల మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పులు, దుస్తులు, గజ్జెలు తదితర వస్తువులను ఎమ్మెల్యే రోజా స్వయంగా అందచేశారు. డప్పులు అందజేసిన ఆమె.. కాసేపు కళాకారులతో కలిసి హంగామా చేశారు. స్వయంగా డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు. ఈ సంరద్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: పవన్ ను పరకాల టార్గెట్ చేశారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement