Sunday, April 28, 2024

Ysrcp – 19 వ రోజుకి చేరిన జగన్ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది..

నేటి ఉదయం గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు నక్కపల్లి, పులవర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరనుంది. భోజన విరామం తర్వాత నరిసింగపల్లి మీదుగా చింతలపాలెంకు బస్సుయాత్ర చేరనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చింతలపాలెం దగ్గర సీఎం జగన్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

- Advertisement -

తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది.. రాత్రి చిన్నయపాలెంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement