Sunday, April 28, 2024

YS Sharmila: ఖ‌ర్గే, వేణుగోపాల్ తో వైఎస్ ష‌ర్మిల భేటీ

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు, అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో వై.ఎస్. షర్మిల భేటీ అయ్యారు. సమావేశానికి మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు.

తాజా రాజకీయాలపై నేతలతో చర్చించారు. తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని షర్మిల తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఏ భాద్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement