Monday, April 29, 2024

Crime: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడు సంవత్సరాల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, సేకరించిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నున్న ప్రాంతంలోని ఎస్. సి కాలనికి చెందిన మైనర్ బాలిక (7)ఓ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నది. అదే ప్రాంతానికి చెందిన అనీల్ అనే యువకుడు స్కూలుకి వెళ్తున్న బాలికను అడ్డుగించి, మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకోగా, జరిగిన సంఘటన గురించి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement