Wednesday, May 1, 2024

AP: తల్లిదండ్రులు మందలించడంతో.. యువతి ఆత్మహత్య

యల్లనూరు ఆగస్టు 16 (ప్రభన్యూస్): మండల పరిధిలోని పెద్ద మల్లేపల్లి గ్రామంలో యువతి ఇవాళ తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దమల్లేపల్లి గ్రామానికి చెందిన పి.రామాంజనేయులు, సావిత్రి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇందులో పెద్ద అమ్మాయికి, అబ్బాయికి వివాహం జరిపించాడు.

రామాంజనేయులు మూడవ కూతురు పి.అశ్విని(19)కి వేములపల్లి గ్రామానికి చెందిన తన మేనమామ (సావిత్రి అన్న కొడుకు)తో వివాహం జరపాలని ఇరుకుటుంబ సభ్యులు మాట మంతి జరుపుకున్నారు. విషయం అమ్మాయికి తెలిసి మేనమామ కొడుకుతో సాన్నిహిత్యంగా ఫోన్ సంభాషణ చేస్తున్న విషయం తల్లిదండ్రులు గమనించారు. దీంతో తల్లిదండ్రులు వివాహం నిశ్చయం కాక మునుపే అతనితో మాట్లాడకూడదని మందలించారు. దాంతో అమ్మాయి మనస్థాపానికి లోనై ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. దీనిపై ఎస్ఐ రామక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement