Thursday, May 2, 2024

Breaking: తిరుప‌తిలో యువకుడి దారుణ హత్య..

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడిని అతి కిరాత‌కంగా చంపేశారు దుండ‌గులు. ఈ దారుణ హత్య ఘటన ఆదివారం ఉదయం జరిగింది. తిరుపతి రూరల్ పేరూరు చెరువు సమీపంలోని గాంధీపురానికి చెందిన బాషా(27) గా మృతుడిని పోలీసులుగుర్తించారు. సంఘటనా స్థలానికి ఎంఆర్ పల్లి సీఐ సురేందర్ రెడ్డి, బ్లూ కోట్సో సిబ్బంది చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య ఎందుకు జరిగింది, ఎవ‌రు చేశార‌నే కారణాలపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement