Friday, April 26, 2024

అసెంబ్లీలో వైసిపి, టిడిపి ఎమ్మెల్యేల ఘ‌ర్ష‌ణ‌…

అమరావ‌తి – ఎపి అసెంబ్లీ లో వైసిపి , టిడిపి ఎమ్మెల్యేలు ఘర్ష‌ణ‌కు దిగారు..ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు య‌త్నించారు.. స‌భ అదుపు త‌ప్ప‌డంతో 11 మంది టిడిపి స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌భ నుంచి స‌స్సెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేశారు.. నేటి ఉద‌యం టిడిపి స‌భ్యులు జివో నెంబ‌ర్ 1 రద్దు కోరుతూ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి..అయితే దీనిని స్పీక‌ర్ తిర‌స్క‌రించారు..ఈ సంద‌ర్భంగా టిడిపి స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు.. ఈ స‌మ‌యంలోనే ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు టిడిపి స‌భ్యుడు బాలాంజ‌య‌నేయులు, బుచ్చియ్య చౌద‌రి వ‌ద్ద‌కు దూసుకువ‌చ్చారు.. వారి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఒక ద‌శ‌లో బుచ్చ‌య్య చౌద‌రి కింద‌ప‌డిపోయారు.. సభ అదుపు త‌ప్ప‌డంతో టిడిపి స‌భ్యుల‌ను సస్పెండ్ చేసిన స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement