Wednesday, May 1, 2024

వైసిపి టిడిపి నేతల మధ్య ఘర్షణ…గాలిలోకి సిఐ కాల్పులు

పల్నాడు జిల్లా, ప్రభ న్యూస్ . పల్నాడు జిల్లా వినుకొండలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జివీ ఆంజనేయులు పై అక్రమ కేసులపై టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వైసిపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపారు.. దీంతో అక్క‌డివారంద‌రూ చెల్లాచెదుర‌య్యారు.. ఇరువ‌ర్గాల‌ను పోలీసులు అక్క‌డి నుంచి పంపివేసి ప‌రిస్థితిని అదుపు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement