Sunday, April 28, 2024

AP: టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్

కర్నూల్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కర్నూల్ వైసీపీ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు టికెట్ ఇవ్వలేదు.

ఆయనకు కాకుండా కర్నూలు మేయర్ బీవై రామయ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో కినుక వహించిన సంజీవ్ కుమార్ వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement