వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నామినేషన్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లొనే ఉన్నాయి అన్నారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు .చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తున్నట్టు తెలిసిందన్నారు.