Thursday, April 25, 2024

AP: వైసీపీ నేతలే డ్రగ్​ కింగ్​లు.. విశాఖ కేసులో ఉన్నది వారే.. చంద్రబాబు

వారికి పక్కా సంబంధాలు ఉన్నాయి
పలు ఫొటోలు, ఫ్లెక్సీలు ఇదే చెబుతున్నాయి
దీనికి సమాధానం చెప్పకుండా టీడీపీపై నిందలు
రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చేశారు
ఈ ఎన్నికల్లో ప్రజలే జగన్​కు తగిన బుద్ధి చెబుతారు
వైసీపీ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్‌షాప్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫొటోలు ఉన్నాయని.. దీనికి సమాధానం చెప్పకుండా తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు.

డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలు..

ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే.. ఆ కేసులో ఇప్పటిరవకు ఎలాంటి పురోగతి లేదన్నారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. డ్రగ్స్ మాఫియా నుంచి ఏపీని కాపాడుకోవల్సిన అవసరం ప్రజలపైనే ఉందన్నారు. డ్రగ్స్‌పై సీఎం జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement