Thursday, April 25, 2024

అరణియార్ ప్రాజెక్ట్ తో రైతులకు నో టెన్షన్!

చిత్తూరు జిల్లా పిచ్చాటూరులోని అరణియార్ ప్రాజెక్ట్ ను జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడంతో అధికారులు అధిక వరద నీటిని దిగువకు విడుదల చేశారని అన్నారు. తాజా పరిస్థితిని పరిశీలించడానికి వచ్చినట్లు చెప్పారు. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులు సుభిక్షంగా పంటలు వేసుకోవచ్చు సుమన్ తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వంలో వర్షాలు సంవృద్దిగా కురిసి అన్నదాతలు సంతోషంగా ఉండటం ఆనందదాయకం అని సుమన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement