Tuesday, May 7, 2024

నారా లోకేష్ స‌మ‌క్షంలో సైకిలెక్కిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు ..

విజ‌యవాడ – ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నేడు టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో వైసిపి కీలకనేతగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. .. గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడాయన వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై గెలిచిన‌ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వైసిపిలో చేర‌డంతో యార్ల‌గ‌డ్డ అస‌హ‌నంతో ఉన్నారు.. వైసిపి నుంచి యార్ల‌గ‌డ్డ‌కు ఎటువంటి భ‌రోసా ల‌భించ‌క‌పోవ‌డంతో ఆ పార్టీని వీడారు.. ఇటీవ‌లే చంద్ర‌బాబును క‌ల‌సిన ఆయ‌న నేడు సైకిల్ ఎక్కారు. ఈసారి ఎన్నికల్లోనూ గ‌న్న‌వ‌రంలో యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement