Friday, May 3, 2024

NLG: కూసుకుంట్లకు టికెట్ కేటాయించడం పట్ల సంబరాలు

సంస్థన్ నారాయణపూర్, ఆగస్టు 21(ప్రభ న్యూస్) : మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ కు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చారు. ఆనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా జడ్పీటీసీ వీరమళ్ళ భానుమతి వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు టికెట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జంగా రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య, కూసుకుంట్ల సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆడెపు సురేష్, సర్పంచ్ లు యాదవ రెడ్డి, దేవిలాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement