Monday, April 29, 2024

నెల్లూరు జిల్లాలో మహిళ హత్య

తోడు వుంటా అన్నోడే కాటికి పంపాడు.. నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లం నెల్లూరు మాధవి అలియాస్ నందిని(25)ని త‌న భ‌ర్తే చంపేశాడు. నెల్లూరు రూర‌ల్ మండ‌లం పెనుబ‌ర్తి గ్రామానికి చెందిన చల్లా గోవర్ధన్ కు నందినికి బెంగుళూరులో పరిచయం ఏర్ప‌డింది. మృతురాలికి ఇదివరకే పెళ్ళై ఇద్దరు మగ పిల్లలున్నారు. అయితే గత కొద్ది రోజులుగా లింగవరంలో మాధవి, గోవర్ధన్ లు క‌లిసి అద్దె ఇంట్లో నివ‌శిస్తున్నారు. నిన్న రాత్రి మాధవిని హత్య చేసినట్టు గోవర్ధన్ 100కి డ‌య‌ల్ చేసి చెప్పినట్టు సమాచారం. లింగవరంలో ఈ హత్య ఘ‌ట‌న జ‌రిగింది. మృతురాలి సొంతవారి కోసం మృతదేహం లింగవరంలోనే ఉంచారు. గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement