Sunday, May 19, 2024

AP: భార్య‌, అత్త‌పై కొడ‌వ‌లితో దాడి… భార్య మృతి

భార్య‌, అత్తపై భ‌ర్త విచ‌క్ష‌ణా ర‌హితంగా కొడ‌వ‌లితో దాడి చేయ‌డంలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న ఘ‌ట‌న ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని అవుకులో చోటుచేసుకుంది. అవుకు పట్టణంలోని బస్టాండ్ లో భార్యను, అత్తను భర్త రంగస్వామి విచక్షణ రహితంగా నరికాడు.

అనుమానంతో పాటు, కుటుంబ సమస్యలతో భార్య కుమారి (30),అత్త సుబ్బలక్ష్మమ్మ (50) లపై కొడవలితో భర్త రంగస్వామి దాడి చేశాడు. భార్య కుమారి పరిస్థితి విషమంగా ఉంది… అలాగే అత్తకు తీవ్ర గాయాలు కావ‌డంతో ఇద్దరిని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్కడ చికిత్స పొందుతున్న భార్య కుమారి పరిస్థితి విషమించడంతో నంద్యాల హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది .

కాగా , దాడి చేసిన అనంతరం రంగ‌స్వామి కొడవలితో వీరంగం సృష్టించాడు. దీంతో రంగ‌స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement