Wednesday, May 1, 2024

సైకిల్ యాత్రలో కింద‌ప‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేత‌లు సైకిల్ యాత్ర నిర్వ‌హించారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్ర సంద‌ర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాదవశాత్తు సైకిల్‌పై నుంచి జారిపడ్డారు. ఆయన దెందులూరు మండలం శింగవరం వద్ద రోడ్డుపై ప్రమాదవశాత్తు పడిపోయారు. కాగా.. ఆయన ఎడమ కాలికి స్వల్పంగా గాయమైంది. సైకిల్‌ యాత్రలో పాల్గొన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement