Sunday, April 28, 2024

Big Breaking | రైలులో అగ్ని ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం

ఏలూరు, ప్రభ న్యూస్ : రైల్వే లైన్ మరమ్మత్తుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ స్టాఫ్ ప్రయాణించే రైలు లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన మరమ్మత్తు విభాగ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ రైలు బోగీలు పెద్ద మొత్తంలో డీజిల్ తో నిండి ఉన్నాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement