Saturday, April 27, 2024

బిల్లు మోత.. కరెంట్ కోత !

ఏలూరు రూరల్ : ఏలూరు రూరల్ ప్రాంతంలో ఉన్న సుంకర వారి తోట సబ్ స్టేషన్ పరిధిలో సుమారు రోజుకు మూడు నుండి నాలుగు గంటలు కరెంటు కోత విధిస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బిల్లులు మోగుతున్నాయి కానీ క‌రెంట్ కోత‌లు మాత్రం ఆగ‌డం లేదంటున్నారు. ఈ కరెంటు కోతలపై సబ్ స్టేష‌న్ ఏఈ శ్రీనివాసును వివరణ కోరగా నాకు తెలియకుండా సబ్ స్టేష‌న్ పరిధిలో ఇటువంటి కరెంటు కోతలు లేవని పొంతనలేని సమాధానం చెప్పడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ కరెంట్ కోతలకు ఉపశమనం ఇస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement