Sunday, May 5, 2024

రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలి.. వెంకయ్య నాయుడు

రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఒక విద్యార్థి రాజధానిపై వెంకయ్య ను ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశాన‌న్నారు. ఇప్ప‌టికే మీకు అర్థ‌మై ఉంటుందంటూ వెంక‌య్య‌నాయుడు క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement