Thursday, March 28, 2024

గోడ కూలి మహిళ మృతి

తంబళ్లపల్లి నియోజకవర్గం మండలంలోని రామ నాయక్ తండా పంచాయతీ బండకింద తండాకు చెందిన బోజలమ్మ (80) అనే మహిళ తను నివాసమున్న‌ ఇంటి గోడ కూలి మృతిచెందిన‌ సంఘటన గురువారం అర్థరాత్రి జరిగిందని పంచాయతీ కార్యదర్శి రెడ్డిప్రసాద్. బాలాజీ తెలిపారు.

విషయం తెలుసుకున్న సర్పంచ్ శిరీష బాబు నాయక్, మండల వైస్ ఎంపీపీ జయచంద్రా రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మృతిచెందిన బోజలమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం నివేదికలు పంపినట్లు తహసీల్దార్ మహేశ్వరి బాయ్, ఎంపీడీఓ శ్రీధరావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement