Sunday, April 28, 2024

ఆదోనిలో వాలంటీర్ దారుణ హత్య…

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో వాలంటీర్ హరిబాబు (22) అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు గొడ్డలితో తలపై నరికి హత్య చేసినట్లు తెలుస్తోంది.

హత్య చేసిన అనంతరం గొడ్డలిని మృతదేహానికి సమీపంలో ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, ఒకటవ పట్టణ సీఐ విక్రమసింహ, రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement