Thursday, May 2, 2024

Vizianagaram – రైలు ప్ర‌మాద బాధితుల‌కు నారా భువ‌నేశ్వ‌రి ప‌రామ‌ర్శ‌..

విజయనగరం: రైలు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి ప‌రామ‌ర్శించారు.. విజ‌య‌న‌గ‌రం హాస్ప‌ట‌ల్ ఆమె బాధితుల‌ను స్వ‌యంగా క‌లిసి మాట్లాడారు..వారికి ధైర్యం చెప్పారు.. పార్టీప‌రంగా బాధితుల‌కు అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు …రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.


ఇది ఇలా ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన స్పందిస్తూ, చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు. నేడు జనం గెలిచారని.. ఈ సంతోషం అందరిది అని అన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement