Saturday, May 4, 2024

జిన్నా పేరు మారుస్తారా.. కూల్చమంటారా?: ఏపీ సర్కార్ కు బీజేపీ అల్టిమేటం

ఏపీలోని రోజుకో కొత్త వివాదాం తెరపైకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఏపీ బీజేపీ నేతలు.. ఇటీవల నిర్వహించన ప్రజాగ్రహ సభ తర్వత స్పీడ్ పెంచారు. తాజాగా గుంటూరులోని జిన్నా టవర్ విషయంపై రగడ కొనసాగుతోంది. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్లలో ఎంతో మంది చావుకు కారణమైన జిన్నా పేరును గుంటూరులో ఓ సెంటర్ కు పెట్టడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఆ సెంటర్ కు జిన్నా పేరును తీసేయాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే పేరు మార్చేయాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. జిన్నా సెంటర్ పేరును మార్చకుంటే ఆ టవర్ ను తాము కూల్చేస్తామని, పేరునూ మారుస్తామని హెచ్చరించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామన్న విష్ణువర్ధన్ రెడ్డి.. రాష్ట్ర రాజధానిలో మార్చలేమా? అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే జిన్నా సెంటర్ పేరును మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement