Monday, April 29, 2024

సీఎం జగన్, చంద్రబాబు నోరు మెదపరెందుకు..? ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర ప్రజలకు టీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోరన్న ఆయన.. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడరా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ తో చంద్రబాబు, జగన్ కు ఉన్న లాలూచీ ఏంటని నిలదీశారు. ఏపీకి ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించిన తర్వాతనే బీఆర్ఎస్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పారు. అలాగే రాజధాని పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటారని, మరోవైపు అమరావతిలోనే ఉంటానన్న జగన్ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement