Tuesday, April 23, 2024

న‌దిలో ప‌డ‌వ మునిగి.. 76 మంది మృతి

న‌దిలో ప‌డ‌వ మునిగిపోవ‌డంతో 76మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న నైజీరియాలో చోటుచేసుకుంది. నైగర్‌ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోవ‌డంతో 76 మంది మరణించగా.. మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 85మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 76 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా గాలిస్తున్నామ‌ని తెలిపారు. ఈ పడ‌వ ప్ర‌మాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement